తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

నెలకు ఒకేసారి టీటీడీ అధికారులు తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‎లైన్ ద్వారా విడుదల చేస్తోంది. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఒక యూజర్‌ ఐడీ నుంచి ఆరు టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది.

    
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ బుధవారం విడుదల చేసింది. కేవలం రోజుకు 20 వేల టికెట్ల చొప్పున 17 స్లాట్లలో టికెట్లను విడుదల చేసింది. కరోనా ప్రోటాకాల్ పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తుంది. నెలకు ఒకేసారి టీటీడీ అధికారులు తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‎లైన్ ద్వారా విడుదల చేస్తోంది. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఒక యూజర్‌ ఐడీ నుంచి ఆరు టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. శ్రీవారి దర్శన టికెట్లతో పాటు.. అద్దె గదులను పొందేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.

Post a Comment

أحدث أقدم