దక్షిణాఫ్రికా కరోనా కొత్త వేరియంట్... ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. మరో ఉద్ధృతికి దారి తీయొచ్చన్న ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ కూడా ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రజల్లో వణుకు పుడుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ప్రమాదకరి కావచ్చని వేగంగా వ్యాప్తించి, తీవ్ర లక్షణాలకు దారి తీయవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.