ఈ నెల 21న బెంజిసర్కిల్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. 21న ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మళ్లింపులు.

విజయవాడ
గుంటూరు వైపు నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ వైపు వెళ్లే కార్లు, ఇతర చిన్న వాహనాలను 21న ఉదయం 8 నుంచి 12 వరకు కనకదుర్గమ్మ వారధిపై అనుమతించరు. మంగళగిరి, తాడేపల్లి, ప్రకాశంబ్యారేజీ మీదుగా విజయవాడలోకి మళ్లిస్తారు. తాడిగడప వైపు నుంచి వచ్చే కార్లు, ఇతర వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్ వరకు అనుమతించి.. అక్కడ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలను రామలింగేశ్వరనగర్ మీదుగా కృష్ణలంక హైవే వైపు మళ్లింపు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నిర్మలా కాన్వెంట్ రోడ్డు, రమేష్ ఆసుపత్రి, రామవరప్పాడు రింగ్ మీదుగా నగరంలోకి. రామవరప్పాడు వైపు నుంచి వచ్చే కార్లు, ఇతర చిన్న వాహనాలను రమేష్ ఆసుపత్రి వరకు మాత్రమే అనుమతిస్తారు. ఏలూరు నుంచి పీఎన్బీఎస్కు వచ్చే బస్సులను రామవరప్పాడు రింగ్ మీదుగా కారల్మార్క్స్రోడ్డు, పోలీసు కంట్రోల్రూమ్ మీదుగా పీఎన్బీఎస్కు, పీఎన్బీఎస్ నుంచి ఏలూరు వెళ్లే వాహనాలను ఇదే మార్గంలో వెనక్కి. ఈ మార్పులను గమనించి తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.