విగ్రహం కోసం వచ్చి.. ఇరుక్కున్నారు


ఏపీలో నంది విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురి అరెస్టు నిందితుల్లో ఇద్దరు తెలంగాణ వాసులు

విగ్రహం కోసం వచ్చి.. ఇరుక్కున్నారు

 అమరావతి, నందిగామ, న్యూస్‌టుడే: ఏపీలోని కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేట కాశీ విశ్వేశ్వర ఆలయంలోని నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. గతేడాది కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. దేవాలయాలపై దాడుల దర్యాప్తునకు ఏర్పాటుచేసిన సిట్‌ అధికారి డీఐజీ అశోక్‌కుమార్‌, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబుతో కలిసి శుక్రవారం నందిగామ డీఎస్పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు ఎ.శ్రీనివాసులు వాట్సప్‌లో వచ్చిన వదంతులతో.. ఈ ఆలయంలోని నంది విగ్రహం చెవుల్లో వజ్రాలు ఉన్నాయని నమ్మాడు. పొట్టలోనూ వజ్రాలు ఉంటాయని అతడి స్నేహితుడ[ు పూజారి అప్పిరాల వెంకటప్పయ్య శాస్త్రి తెలిపారు. వాటిని కాజేసేందుకు వికారాబాద్‌ జిల్లాకు చెందిన చిట్యాల కృష్ణయ్యతో కలిసి రెక్కీ చేశారు. ముంద]ుగా ఆలయాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకించారు. తర్వాత విజయ్‌, రామకృష్ణ అనే మరో ఇద్దరితో కలిసి గతేడాది సెప్టెంబరు 16 అర్ధరాత్రి ఆలయానికి వెళ్లారు. లోపలకు వెళ్లి సుత్తితో విగ్రహం చెవులు విరగ్గొట్టి బయల్దేరారు. దారిలో చెవులను ధ్వంసం చేయగా వజ్రాలు లేవు. దాంతో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. పొట్టభాగంలో వజ్రాలు ఉంటాయని, దానికోసం విగ్రహాన్ని తీసుకెళ్లాలని శ్రీనివాసులు భావించాడు. పాత విగ్రహం కోసం ఆలయపూజారి యుగంధర్‌ శర్మను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన వెంటనే పోలీసులకు విషయం తెలిపారు. పాత విగ్రహం ఇస్తామని చెప్పి నిందితులను ముక్త్యాలకు రప్పించి.. పోలీసులు వాళ్లను అరెస్టుచేశారు. అరెస్టయినవారిలో శ్రీనివాసులు, చిట్యాల కృష్ణయ్య, విజయ్‌, రామకృష్ణ, గంపలగూడెం మండలం వెనకడపల్లికి చెందిన పూజారి వెంకటప్పయ్య శాస్త్రి, జగ్గయ్యపేటకు చెందిన నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా అచ్చెంపేటకు చెందిన అన్నం గోపాలరావు ఉన్నారు. వీరివద్ద రెండు కార్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 ఆలయాల చిత్రాలు ఉన్నాయి

Post a Comment

Previous Post Next Post