నలుగురు దర్శకుల‘పిట్టకథలు’

నిర్దిష్ట భావాలున్న నలుగురు మహిళల కథలతో ‘పిట్టకథలు’ సంకలనం రూపొందింది. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాల్ని ప్రముఖ దర్శకులు నాగ్‌ అశ్విన్‌, బి.వి.నందినిరెడ్డి, తరుణ్‌ భాస్కర్‌, సంకల్ప్‌రెడ్డి తెరకెక్కించారు. ఈషారెబ్బా, లక్ష్మీ మంచు, అమలాపాల్‌, శ్రుతిహాసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఆషిమా నర్వాల్‌, జగపతిబాబు, సత్యదేవ్‌, సాన్వే మేఘన, సంజిత్‌ హెగ్డే ఇతర పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19 నుంచి 190 దేశాల్లో ప్రదర్శితం కానున్నాయని, 

నలుగురు దర్శకుల‘పిట్టకథలు’

ఇది మా తొలి తెలుగు ఒరిజినల్‌ చిత్రాలని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ బుధవారం ప్రకటించింది. ‘‘గొప్ప కథలు ఎక్కడి నుంచైనా రావొచ్చు. మేం దేశం నలుమూలలకి చెందిన కథల్ని చెప్పి మా చిత్రాల పరిధిని విస్తరించాలని సంకల్పించాం.’’ అన్నారు నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఒరిజినల్‌ ఫిల్మ్స్‌ డైరెక్టర్‌ సృష్టి బెహ్ల్‌ ఆర్య. ‘‘నాలుగు ప్రత్యేకమైన ఇతివృత్తాలున్న నాలుగు కథలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇందులోని ప్రతి కథ దేశంలోని ఒక్కో అందమైన సంస్కృతిని ఆవిష్కరిస్తుంద’’న్నారు దర్శకులు తరుణ్‌భాస్కర్‌, నందినిరెడ్డి, నాగ్‌ అశ్విన్‌, సంకల్ప్‌రెడ్డి.

నలుగురు దర్శకుల‘పిట్టకథలు’


Post a Comment

Previous Post Next Post